హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలులో 4,500 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ప్రకాశం: ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4,500 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో MLA దామచర్ల జనార్దన్‌రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని కోరారు. మట్టి విగ్రహాలతో పర్యావరణానికి హాని ఉండదని, ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు.