BPT: వారాంతపు సెలవులకు తోడు వినాయక చవితి పండగ రావడంతో జిల్లాలోని తీర ప్రాంతాలకు పర్యాటకులు భారీగా వచ్చారు. దీంతో బీచ్లలో సందడి నెలకొంది. పర్యాటకుల భద్రత, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు డ్రోన్లతో పహారా నిర్వహిస్తున్నారు. సముద్ర తీరాల్లో గజ ఈతగాళ్లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సముద్ర తీరంలో డ్రోన్లతో పహారా!


