హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా!

ప్రకాశం జిల్లా ఈతముక్కలకు చెందిన ఓ కుటుంబం మంగళగిరి ఎయమ్స్‌లో క్యాన్సర్‌ చికిత్స చేయించుకుని ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. పోలిరెడ్డిపాలెం బ్రిడ్జి వద్ద డ్రైవర్ నిద్రమత్తులో జారుకోగానే పక్కనే కూర్చున్న అశోక్ గమనించి స్టీరింగ్ పట్టుకుని సడన్ బ్రేక్  వేశాడు. దీంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.