హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

NGKL: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఇంట్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. అలాగే, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.