హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

AKP: నియోజకవర్గ ప్రజలకు హోంమంత్రి అనిత వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు.