హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి గణపతులనే ప్రతిష్ఠించుకోవాలి'

HNK: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి గణపతులనే ప్రతిష్ఠించుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. ఆదివారం బాలసముద్రంలోని మున్సిపల్ అతిథి గృహం వద్ద శివకుమార్ ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహాల స్టాల్‌ను ఆమె పరిశీలించారు. 12 ఏళ్లుగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న శివకుమార్‌ను అభినందించారు. ప్రజలు స్వచ్ఛందగా మట్టి గణేష్‌లను పూజించాలని సూచించారు.