హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

SRCL: సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో BRS నాయకుల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో BRS ఉమ్మడి కరీంనగర్ జిల్లా ZP ఛైర్ పర్సన్ తుల ఉమా, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ ఛైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, బొల్లి రామ్మోహన్, ఆకుల జయంత్, తదితరులు పాల్గొన్నారు.