హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 18న ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్‌షిప్ మేళా

ADB: ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీలో ఈ నెల 18న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐ, ఏటీసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకుని హాజరుకావాలని సూచించారు. పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు.