BHNG: యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవానీశంకర్కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముక్కెర్ల సతీష్ యాదవ్ విత్తన గణపతులను అందజేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆశయంతో వీటిని తీసుకొచ్చినట్లు తెలిపారు. విత్తన గణపతిని పూజించి నేలలో నాటితే మొక్కగా ఎదిగి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు.
తెలంగాణ
యాదాద్రి ఈవోకు విత్తన గణపతి అందజేత


