హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టా భూములను 22ఏ నుంచి తొలగించాలి: దావ వసంత

JGL: పట్టా భూములను 22ఏ నుంచి తొలగించాలని దావ వసంత అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి రాయికల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగిత్యాల నియోజకవర్గంలో 16,005 ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. నిజమైన హక్కుదారులను గుర్తించి వెంటనే జాబితా నుంచి తొలగించాలని, గ్రామాల వారీగా భూములపై విచారణ చేపట్టాలన్నారు.