BHPL: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించాలని భూపాలపల్లి SP సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ పేర్కొన్నారు. నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆన్లైన్లో ఇంటిమేషన్ ఫారం సమర్పించి, స్థల యజమాని నుంచి ఎన్వోసీ పొందాలని తెలిపారు. అనధికార విద్యుత్ కనెక్షన్లు వాడొద్దని, డీజేలకు అనుమతి లేదన్నారు.
తెలంగాణ
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: SP


