సత్యసాయి: జిల్లాలో రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణ హాజరై మ్యాచ్లను ప్రారంభించారు. నర్సింహ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని ఆదినారాయణ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలు ప్రారంభం


