హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెమీ ఫైనల్‌కు గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ బాలుర జట్టు

పల్నాడు: విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా బాలుర జట్టు సెమీఫైనల్‌కు చేరింది. అనకాపల్లి జట్టుపై 11-0, బాపట్ల జట్టుపై 10–0, విశాఖపట్నం జట్టుపై 1-0 తేడాతో విజయం సాధించింది. క్వార్టర్‌ఫైనల్లో 10-0 తేడాతో ఘన విజయం నమోదు చేసి సెమీఫైనల్‌కు చేరిందని పీ.డీ సైదయ్య తెలిపారు.