హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతతో చమర్తి జగన్మోహన్ రాజు భేటీ

అన్నమయ్య: యువత తమ ప్రతిభ, ఆలోచనా శక్తిని సమాజ అభివృద్ధికి వినియోగించాలని టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు సూచించారు. మున్సిపాలిటీలోని 9వ వార్డు ముకుందా రుగడ్డ, మంగళమిట్ట, మహబూబ్‌నగర్ ప్రాంతాల యువతతో ఆయన భేటీ అయ్యారు. మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.