హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోక్ అదాలత్‌లో 43,518 కేసులు క్లియర్

NTR: మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని న్యాయస్థానాల సముదాయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 43,518 పెండింగ్ కేసులు పరిష్కరించి కక్షిదారులకు రూ.20.09 కోట్ల పరిహారం ఇప్పించారు. ఈ అదాలత్‌లో 16 బెంచ్‌లు ఏర్పాటు చేసి క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించినట్లు రెండో అదనపు జిల్లా జడ్జి సునీల్‌కుమార్ తెలిపారు.