హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లేపల్లిలో 21 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్ మల్లేపల్లిలో 21 కిలోల గంజాయిని హబీబ్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానికంగా విక్రయించేందుకు సిద్ధమవుతుండగా మంగర్‌బస్తీలో పోలీసులు దాడి చేసి నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.