హైదరాబాద్: 28°C
క్రీడలు

జూనియర్ ఆసియాకప్‌.. ఫైనల్‌కు భారత్

జూనియర్ ఆసియాకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో సౌత్ కొరియాను 5-1 తేడాతో ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. సుప్రియ హ్యాట్రిక్, మధు సిదార్, సుఖ్వీర్ కౌర్ తలో గోల్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. చైనా- జపాన్ మధ్య జరిగే మరో సెమీస్‌ విజేతతో భారత్ ఫైనల్‌లో తలపడనుంది. కాగా, పురుషుల జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది.