హైదరాబాద్: 28°C
తెలంగాణ

నంది మేడారం ఇన్‌ఛార్జ్ జడ్జిగా స్వారిక

PDPL: ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జిగా గోదావరిఖని ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కుమారి స్వారిక గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన మట్ట సరిత జగిత్యాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన స్వారికకు న్యాయవాదులు పుష్పగుచ్చం అందజేసే శుభాకాంక్షలు తెలిపారు.