GNTR: ఎడ్లపాడు మండలంలో గుంటూరు నుంచి ఎడ్లపాడు వైపు వస్తున్న ఆటోలోని ఓ ప్రయాణికుడు వంకాయలపాడు దాటిన తర్వాత ఫిట్స్ వచ్చి కింద పడ్డాడు. డివైడర్ను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ 108కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించి, వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో నుంచి పడి వ్యక్తి మృతి


