NLG: చండూర్ మార్కెట్లో వ్యాపారులను బెదిరించిన ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. ధాన్యపు వ్యాపారులను బెదిరించి రూ.5 లక్షల చొప్పున డిమాండ్ చేసి వసూళ్లకు ఒడిగట్టిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.9.80 లక్షల నగదు, 11 సెల్ఫోన్లు, ఒక బోలెరో వాహనాన్ని (TS 07 UK 4505) స్వాధీనం చేసుకున్నట్లు చండూర్ సీఐ రాము తెలిపారు.
తెలంగాణ
వ్యాపారులను బెదిరించిన ముఠా అరెస్ట్!


