VSP: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు పొడిగించాలని ఉదయ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డాది ఉదయ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 12, 13, 14వ తేదీల్లో వరుస సెలవులతో అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పింఛన్ దరఖాస్తుల గడువు పెంచాలి'


