నాగర్ కర్నూల్ జిల్లాలో గణేశ్ మండపాల నిర్వాహకులు నిమజ్జన శోభాయాత్రలను సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించాలని ఎస్పీ డా.సంగ్రామ్సింగ్ జీ.పాటిల్ సూచించారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. అధిక శబ్దం వచ్చే డీజేల కంటే డప్పు వాయిద్యాలు మేలన్నారు. సన్నాయి, కోలాటం, భజనలు, నృత్యాలను ప్రోత్సహిస్తూ.. పోలీసుల నిబంధనలు పాటించాలని కోరారు.
తెలంగాణ
'శోభయాత్రను సంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించాలి'


