హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎం, సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం'

ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌ వద్ద జిల్లా సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామపంచాయతీల జనరల్‌ ఫండ్‌ను STO ద్వారా కాకుండా నేరుగా డ్రా చేసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫోరం కన్వీనర్‌ ముష్నేపల్లి కుమార్‌గౌడ్‌, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.