హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కార్యకర్తకు ఆర్థిక సాయం

సత్యసాయి: ధర్మవరం తారకరామాపురానికి చెందిన జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ ఇటీవల ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కాలుకు మూడు చోట్ల ఫ్రాక్చర్ అయ్యింది. విషయం తెలుసుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన రెడ్డి శుక్రవారం ఆయన్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని చికిత్స ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.