హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు'

సత్యసాయి: కూటమి నాయకులు, కార్యకర్తలు, వినతిదారులు, వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి శుక్రవారం మంత్రి సవిత వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజలు, నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల వినతులపై తక్షణమే స్పందించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.