హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అటవీ అమరవీరుల త్యాగాలు గుర్తుంచుకోవాలి'

MNCL: అడవులు, వన్యప్రాణులను కాపాడటంలో అటవీ అధికారులు, సిబ్బంది త్యాగాలను అందరూ గుర్తుంచుకోవాలని జన్నారం అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మమత కోరారు. అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అటవీ అధికారులు, సిబ్బందితో కలిసి జన్నారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అడవులను వన్యప్రాణులను కాపాడడంలో అందరూ ముందుకు రావాలని కోరారు.