NRML: జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా చించోలి గండి రామన్న అర్బన్ పార్క్ వద్ద అటవీ అమరుల స్థూపానికి అటవీ మండల అధికారి నాగిని మాను పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ అమరులైన వారి కుటుంబ సభ్యులను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో శివకుమార్, రామకృష్ణారావు, అటవీ క్షేత్ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
అటవీ అమరులకు ఘన నివాళి


