హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'

RR: కేశంపేట్ పోలీసులు లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబాల్ నాయక్‌ను ముందస్తుగా అరెస్టు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, సేవాలాల్ జయంతికి సెలవు ప్రకటించాలన్నారు.