హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికుల కోసం సరికొత్త ఫిచర్

KNR: ప్రయాణికుల సౌకర్యార్థం TGSRTC సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇకపై రైల్వే స్టేషన్ల తరహాలో RTC బస్టాండ్లలోనూ ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్, LED డిస్‌ప్లే సౌకర్యం అందుబాటులోకి రానుంది. కరీంనగర్ రీజియన్‌లోని 13 బస్టేషన్లలో GPS ఆధారిత ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టనుండగా, బస్సు 500 మీటర్ల దూరంలోకి రాగానే అనౌన్స్‌మెంట్, ప్లాట్‌ఫాం వివరాలు తెలియనున్నాయి.