హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్

SDPT: తొగుట మండల కేంద్రంలో గురువారం వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ.8.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.