హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూరు శాతం రుణ లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్

మెదక్‌ జిల్లాలో బ్యాంకులు నూరు శాతం రుణ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. మొదటి త్రైమాసికంలో వివిధ రంగాలకు రూ.1,713.32 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. రైతులు, మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.