హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

SDPT: జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాల్‌ సూచించారు. రాజీ పడదగిన కేసులు, సివిల్‌ తగాదాలు, కుటుంబ, ఆస్తి వివాదాలను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, చెక్‌బౌన్స్‌ తదితర కేసులను కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.