హైదరాబాద్: 28°C
వ్యాపారం

మార్కెట్‌లోకి కొత్త జావా 42 ఆల్‌స్టార్స్

మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ 'జావా 42 ఆల్‌స్టార్స్‌' బైక్‌ను రూ.1,79,942 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. 294.72 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డిస్క్ బ్రేకులు ప్రామాణికంగా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా బుకింగ్స్ మొదలుకాగా, ఈనెల 14 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.