PPM: పాలకొండ నగర పంచాయతీ వెంకమ్మపేట రక్షిత పథకం పరిధిలో ఇవాళ, రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని కమిషనర్ పి.నూకరాజు ఓ ప్రకటనలో తెలిపారు. రక్షిత పథకం నుంచి భూగర్భంలోని పాత పైపులు తొలగించి నూతన పైపులు ఏర్పాటు చేయనున్నారు. గురువారం 1, 2, 11, 12, 17, 18, 19, 20 వార్డులకు నీటి సరఫరా ఉండదని, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం


