CTR: బంగారుపాళ్యెం మండలం మొగిలీశ్వరస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని చిత్తూరు దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్వేత పర్యవేక్షణలో లెక్కించారు. 110 రోజులకు సంబంధించి హుండీల ద్వారా రూ.4,74,049, అన్నదాన హుండీల నుంచి రూ. 93,108 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త విజయ్ కుమార్, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హుండీ ఆదాయం రూ. 5.67 లక్షలు


