హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

CTR: చిత్తూరులో రోడ్డు మరమ్మతుల దృష్ట్యా ఇవాళ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు కొంగారెడ్డిపల్లె ట్రాన్స్ కో ఏఈ రాము తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు సీఆర్ మిట్ట, సీకేపల్లె, రఘురామ నగర్ కాలనీ, మైదా ఫ్యాక్టరీ రోడ్డు, సాంబయ్యకండ్రిగ, శ్రీనగర్ కాలనీల్లో విద్యుత్ ఉండదని ఆయన తెలియజేశారు.