SRD: జిన్నారం మున్సిపాలిటీ మంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు దావునూరి చంద్రశేఖర్కు 'భారత్ గురు రత్న అవార్డు–2026' లభించింది. వినూత్న బోధనా పద్ధతులు, టీఎల్ఎం వినియోగంతో విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడం, ఎంఆర్పీ, డీఆర్పీగా ఉపాధ్యాయ శిక్షణలో సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. ఆయన్ని పలువురు అభినందించారు.
తెలంగాణ
ఉపాధ్యాయుడికి 'భారత్ గురు రత్న' అవార్డు


