హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

64 పశువుల షెడ్లు మంజూరు

AKP: ఎస్.రాయవరం మండలంలో వీఎన్‌జీ రాంజీ-11 ద్వారా పల్లె పండుగ-3.0 పథకంలో 64 పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.84.20 లక్షల పరిపాలనా ఆమోదం లభించినట్లు ప్రోగ్రాం అధికారి, ఎంపీడీవో మీనాకుమారి తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. మంజూరైన షెడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు.