WGL: రాయపర్తి మండలంలోని కోలన్పల్లి, కేశవాపూర్, బురహన్పల్లి గ్రామాల్లో చేపట్టనున్న దేవాదుల కాలువ పనులపై శనివారం గ్రామ సభ నిర్వహించారు. ఆర్డీవో సుమ, తహసీల్దార్ శ్రీనివాస్ గ్రామస్తులతో సమావేశమై కాలువ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గ్రామస్తుల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకుని, పనులపై అవసరమైన వివరాలను అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
కాలువ పనులపై గ్రామస్తులతో ఆర్డీవో సమావేశం


