GDWL: FFS యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు, పంపిణీ జరుగుతాయని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి తెలిపారు. శనివారం అలంపూర్ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి, వ్యాపారులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ఈ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు FFS విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
యాప్పై అవగాహన కల్పించిన అధికారులు


