JNG: జిల్లావ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బచ్చన్నపేట మండలానికి చెందిన మాజీ వార్డు మెంబర్ కోడూరి రామలక్ష్మి ఈరోజు ఉదయం హార్ట్ అటాక్తో మృతిచెందారు. ఆమె మృతి పట్ల బంధువులు, విశ్వకర్మ సంఘం నాయకులు, పట్టణ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు.
తెలంగాణ
గుండెపోటుతో మాజీ వార్డ్ మెంబర్ మృతి


