హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రియాంక కేసులో పోలీసుల విచారణ పూర్తి

E.G: రాజమండ్రిలో ప్రియాంక మృతి ఘటనకు కారణమైన నిందితులు దశ్వంత్, దేశాబత్తుల ఆండ్రూ జోసెఫ్‌ అడ్వర్డ్స్‌ల పోలీస్ కస్టడీ శుక్రవారం ఉదయం 11 గంటలతో ముగిసింది. వారిని ప్రకాశంనగర్‌ పోలీసులు ఉదయం 10.24 గంటలకు GGHకు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చారు. అనంతరం రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చారు. వచ్చేనెల 3 వరకు రిమాండ్‌ పొడిగించారు.