NZB: ఈ నెల 22 నుంచి మండలంలో హెల్మెట్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ఎస్సై సుమలత తెలిపారు. ద్విచక్ర వాహనదారులు, పిలియన్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు.
తెలంగాణ
హెల్మెట్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే వాహనం సీజ్


