హైదరాబాద్: 28°C
వ్యాపారం

మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్: మస్క్

భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఇంకా  11 వేల గ్రామాల్లో 4జీ కవరేజీ లేదని ఓ ఎక్స్ యూజర్ పోస్ట్ చేశాడు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ తాము సేవలందించగలమని మస్క్ వెల్లడించారు.