SDPT: సిద్దిపేట బస్ డిపోలో టీఎంయూ సంఘం నూతన కార్యవర్గంను శుక్రవారం ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షుడిగా కేఎం రెడ్డి, కార్యదర్శిగా జీ. బాలయ్య ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు డిపో మేనేజర్ శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు విన్నవించారు. ఈ సందర్భంగా డీఎం సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
నూతన కార్యవర్గం ఏర్పాటు


