హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌‌కు వెల్ది యువకులు ఎంపిక

జనగామలో ఇవాళ నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో వెల్దికి చెందిన ఇద్దరు యువకులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్‌-20 లాంగ్‌జంప్‌లో కళ్లెం నవీన్‌ ప్రథమ స్థానం సాధించగా, అండర్‌-18, 100 మీ. పరుగు పందెంలో గొల్లూరి చందు ద్వితీయ స్థానంలో నిలిచాడు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన యువకులను పలువురు అభినందించారు.