E.G: గోపాలపురం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలపై సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించి, నియోజకవర్గ వ్యాప్తంగా ఒకరోజు పాదయాత్ర నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. త్వరలో కూటమి నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం


