హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్ నీళ్లపై మాజీ మంత్రి ఫైర్

NLG: సాగర్‌ నీటి విషయంలో ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, MLA జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఏపీకి నీటిని తరలిస్తున్నా మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సాగర్‌లో నీళ్లు ఉన్నప్పటికీ ఎడమ కాల్వ, లిఫ్ట్‌లకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీటిని విడుదల చేయాలని, లేదంటే BRS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.