హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారాన్ని సకాలంలో అందించాలని సూచించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ మాట్లాడారు. నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.