హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ వర్క్ వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలి

MDCL: మధురానగర్‌ కాలనీలో గుంతలమయమైన రోడ్డుకు అధికారులు ప్యాచ్‌వర్క్‌ చేపట్టారు. రోడ్డు మరమ్మతులతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దెబ్బతిన్న డ్రైనేజీ ఇటీవల పొంగిపొర్లిందని తెలిపారు. ముందుగా డ్రైనేజీని పూర్తిగా సరిచేసి, అనంతరం రోడ్డు వేయాలని కోరారు. డబుల్‌ వర్క్‌ లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.